MLG: ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల నూతనంగా ఎన్నికైన సర్పంచుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. గ్రామ సమస్యలను త్వరగా పరిష్కరించి శుభ్రత, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఆదాయాభివృద్ధిపై దృష్టి పెట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. 5 రోజుల శిక్షణ పొందిన సర్పంచులకు సర్టిఫికెట్లు అందజేశారు.