KMM: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్లను ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. సన్నబియ్యం నిల్వలు, నాణ్యత, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిల్వల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బియ్యం రక్షణకు రసాయనాల వినియోగంపై అధికారులకు సూచనలు చేశారు.