MNCL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వినోద్ కోరారు. శనివారం బెల్లంపల్లిలోని 23,16వ వార్డులలో డ్రైనేజీ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.