NLG: ఇటీవల జిల్లా జనరల్ దవాఖానలో పరిపాలనా విభాగంలో ఇద్దరిపై పలు ఆరోపణలు వచ్చాయి. స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిపై విచారణ చేసి ఈనెల 26లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలను పక్కన బెట్టిన అధికారులు ఏమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తూ..వసూళ్ల పర్వాన్ని మాత్రం ఆపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.