SRCL: వేములవాడ రాజన్న క్షేత్రంలో శుక్రవారం ఉదయం జరగనున్న శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ వసతి గదులు, లాడ్జీలు నిండిపోవడంతో భక్తులు గుడి చెరువు పార్కింగ్ ప్రాంగణం వంటి బహిరంగ ప్రదేశాల్లోనే బస చేశారు. రాజన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి.