KNR: సైదాపూర్ మండలం రాయికల్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను సర్పంచ్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. బంజారా సమాజ ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొంత సుధాకర్, ఎంపీడీవో యాదగిరి, ఆస్ఐ వినోద్,మాజీ సర్పంచ్ అక్షయ శ్రీనివాస్ పాల్గొన్నారు.