సిద్దిపేట: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణ కోసం శనివారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏసీపీ ఎస్. సదానందం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లకు చూపు మందగించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ఈ ప్రత్యేక తనిఖీలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు.