NZB: భీంగల్ మండలంలోని బడా భీంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మండల స్థాయి ఎస్ఎస్సీ ఇంటర్నల్ మార్క్స్ పరిశీలన బృందం సందర్శించింది. పదవ తరగతి విద్యార్థుల వివిధ విద్యా సామర్థ్యాలను పరిశీలించి, అంతర్గత మార్కులను నమోదు చేశారు. ఈ బృందంలో మచ్కూర్ పాఠశాల హెడ్మాస్టర్ హఫీసుద్దీన్, ఉపాధ్యాయులు మారుతి పాల్గొన్నారు.