SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో రూ.20 లక్షల విలువైన 106 మొబైల్ ఫోన్లను ఎస్పీ నరసింహ బాధితులకు అందజేశారు. 11వ సారి ఈ మేళా నిర్వహించి రికవరీ చేసిన ఫోన్లను పంపిణీ చేశారు. ఫోన్లలో వ్యక్తిగత సమాచారం ఉంటుందని, మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే ‘CEIR’ పోర్టల్ ద్వారా బ్లాక్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ ఈరోజు తెలిపారు.