WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఆదివారం రాత్రి ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ఐషర్ 380 ట్రాక్టర్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై బాధితుడు సయ్యద్ కరీం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ను వెతికేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.