KMM: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. పెద్దాస్పత్రి పరిసరాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించిన ఆయన పార్కింగ్ నిర్వహణ తీరును సమీక్షించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి ఆస్పత్రిలో అవసరమైన ఏర్పాట్లపై చర్చించి కార్పొరేషన్ నిధుల ద్వారా పనులు చేపట్టాలని నిర్ణయించారు.