JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సీఎస్ఆర్ నిధులతో కంప్యూటర్లను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యారంగ బలోపేతానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుందని, విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.