KNR: గంగాధర మండలం కూరిక్యాల సొసైటీ కార్యాలయంలో రైతు భరోసా దరఖాస్తులను స్వీకరిస్తునట్లు కురిక్యాల క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వెంకట్ స్వామి తెలిపారు. రైతులు భూమి పట్టా పాసుబుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్సులను సొసైటీ కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు. అన్నదాతలకు దీనిపై ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.