MBNR: హన్వాడ మండలం కిష్టంపల్లికి చెందిన గాయత్రి తనకు పురిటి నొప్పులు రావడం వలన 108కి ఫోన్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది శ్రీనివాస్ ఇంటి దగ్గరే కాన్పు చేయడం వల్ల ఆమె పండంటి మగ బిడ్డకు జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. వారిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించినట్లు పైలెట్ సలీం, శ్రీనివాస్ తెలిపారు.