NZB: మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని బిక్కనూర్ ఎంఈవో రాజగంగారెడ్డి ఆదేశించారు. గురువారం బస్వాపూర్ గ్రామంలోని రైతు వేదికలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన భోజనం అందించకపోతే ఏజెన్సీలు రద్దు చేస్తామని హెచ్చరించారు.