PDPL: జిల్లాలో ఇవాళ నిర్వహించిన మొదటి సంవత్సరం గణితం/బాటని/ పొలిటికల్ సైన్స్ పరీక్షకు 97% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 5780 మంది పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 5613 మంది హాజరయ్యారు. మొత్తం 167 మంది గైర్హాజరయ్యారు.