SDPT: హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ కులదేవత శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయ సింహద్వార రోహణం, దర్వాజా ముహూర్తం శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు ఇంటింటి నుంచి బిందెలతో నీళ్లు, కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు తీసుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం సందడి నెలకొంది.