BDK: పర్యావరణానికి హాని చేయని సాధారణ రంగులనే వాడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సూచించారు. భద్రాద్రి జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతియుత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. మంగళవారం మణుగూరు మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొని, నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగులు చల్లుకున్నారు.