MNCL: మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని జన్నారంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సచిన్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జన్నారం మండలంలోని ఐకేపీ కార్యాలయంలో స్థానిక ఏపీఎం లలిత, మహిళలను ఆయన శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో RBI VIDS దండేపల్లి CFL కౌన్సిలర్స్ వేల్పుల రవీందర్, హరీష్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ నితిన్ పాల్గొన్నారు.