ADB: జిల్లా నార్నూర్ మండలంలోని సుంగాపూర్ గోండుగూడలో మంగళవారం ఆదివాసీలు కలిసి మోహతుర్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న తమ సంప్రదాయబద్దంగా దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారులు, పెద్దలు కలిసి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో లచ్చు పటేల్, జూగాదీరావు, తెలంగరావు, రాము ఉన్నారు.