KKD: జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మంగళవారం పూర్తయింది. జిల్లా పరిధిలో 61 మందిని బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్, నోడల్ అధికారి షాన్ మోహన్ ఉత్తర్వులిచ్చారు. ఏడుగురు తహసీల్దార్లు, 27 మంది డీటీలు, 14 మంది సీనియర్ అసిస్టెంట్లు/ఆర్పాలు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఏడుగురు ఆఫీస్ సబార్డినేట్లు, ఒక డ్రైవర్ ఉన్నారు.