CTR: పురుగు మందు లేని వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. శాంతిపురం మండలంలోని గుండిశెట్టిపల్లిలో నేచురల్ వెజిటేబుల్ కలెక్షన్ సెంటర్ను గురువారం ఆయన ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. కుప్పం ప్రాంత రైతులు ఆ దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.