GDWL: రేపు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి గద్వాల రానున్నారని జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9:30కి పుటాన్ పల్లిలో సీడ్ పత్తి పంట స్థితిగతులపై సమీక్ష నిర్వహించనున్న ఆయన, అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఉదయం 11:30కి ఐడీవోసీ మందిరంలో విత్తన పత్తి రైతులతో సమావేశం జరగనుంది.