W.G: మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ ఆకనవారితోటకు చెందిన అయితం థాన్ చందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. గురువారం గుంటూరు ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదగా సాగులో నూతన విధానాలు, మేలైన యాజమాన్య పద్ధతులు అవలంభించిందుకు ఈ అవార్డును అందుకున్నారు.