W.G: భీమవరం నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్గా చినిమిల్లి రాయుడిని నియమిస్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు ఆయన శాసనమండలి ఛైర్మన్ కొయ్య మోషన్ రాజుని గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.