KMM: జిల్లాలో ఇవాళ్టి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు అయినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఖమ్మం నగరంతో పాటు మధిరలో డిప్యూటీ సీఎం పర్యటించాల్సి ఉండగా.. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కార్యక్రమాలను వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలన్నారు.