NRPT: మద్దూరులో ఎస్బీఐ సమీపంలోని షెట్టర్లలో పీడీఎస్ బియ్యం ఉన్నాయనే విశ్వాసనీయ సమాచారం మేరకు డీటీ ఆనంద్, కోస్గి డీటీ భాస్కర్ కలిసి మంగళవారం తనిఖీ చేయగా బియ్యం పట్టుబడ్డాయి. బియ్యాన్ని తరలిస్తున్న ఆటో డ్రైవర్పైన, షట్టర్ యజమాని మహమూద్ పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బియ్యాన్ని ఖాజీపూర్ డీలర్ శ్రీలతకు అప్పగించామని పేర్కొన్నారు.