ప్రకాశం: మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో ఐదుగురిని మంగళవారం గిద్దలూరు కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. న్యాయమూర్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 5 మందిలో ముగ్గురికి రూ.10,000 చొప్పున జరిమానా విధించడంతోపాటు ఒకరికి 2 రోజులు, మరొకరికి 5 రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. శిక్ష పడినవారికి 6 నెలల వరకు లైసెన్స్ రద్దు చేశారు.