NDL: మండల కేంద్రమైన ఔకులో తేరు వీధికి చెందిన కటికాల లక్ష్మీదేవి (55) మంగళవారం పేడ రంగు పొడి తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా వారికి ఇంటిలో గొడవలు జరుగుతుండడంతో కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.