BDK: నియోజకవర్గ వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలలో రోగులకు అసౌకర్యం కలగకుండా అన్ని సేవలు అందించాలని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశించారు . ఆదివారం సాయంత్రం మణుగూరు 100 పడకల ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు . వ్యాధిగ్రస్తులను ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.