HYD: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో మంగళవారం స్విమ్మింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. దాదాపు 200 మంది పోటీల్లో సందడి చేశారు. ఈతతో ఆరోగ్యం మెరుగు పడుతుందని.. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాలని సూచించారు. అనంతరం నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేఐసీ ప్రెసిడెంట్ కే. సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.