NLG: నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలు అందజేశారు.