MDK: మనోహరాబాద్ మండలంలో అక్రమ మట్టి రవాణా జోరుగా సాగుతోంది. ఓ ప్రైవేట్ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తూ అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని, పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలన్నారు.