KNR: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ట్రాన్స్ కో ఆధ్వర్యంలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రజలకు ఏమైనా విద్యుత్ సమస్య లుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వైర్లు తెగితే సిబ్బందితో రిపేర్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ దివాకర్ రావు, సబ్ ఇంజనీర్ నవీన్, సర్పంచ్ ముదాం రవి, ట్రాన్స్ కో సిబ్బంది పాల్గొన్నారు.