NLG: జిల్లా ఎరుకల ఉద్యోగుల సంఘం నాయకులు ఆదివారం నకిరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చర్లపల్లి వెంకటయ్య, కోశాధికారి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మొగిలి విజయ్ శేఖర్, గౌరవాధ్యక్షులు ఉండ్రాతి కృష్ణయ్య, సహా పలువురు ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు. అనంతరం ఎరుకల సంఘం సంక్షేమంపై చర్చించారు.