VKB: వ్యవసాయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ సబ్సిడీని ప్రకటించింది. రైతులు డ్రోన్లను కొనుగోలు చేసేందుకు 40 శాతం రాయితీ అందించనున్నట్లు పెద్దేముల్ మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం తెలిపారు. మండల కేంద్రాల్లోని రైతు వేదికల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు అధిక లాభాలు గడించాలని పవన్ ప్రీతం ఈ సందర్భంగా కోరారు.