ADB: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, ఈ మేరకు ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ అసెంబ్లీని ముట్టడించనున్నట్లు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ సోమేశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, ఏజెన్సీలో ప్రత్యేక ఉద్యోగ నోటిఫికేషన్ కోసం నిరసన చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.