WGL: రాయపర్తి మండలంలో గ్రామాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ చెత్తను ఇంటి వద్దే వర్గీకరించాలని ఎంపీవో కూచన ప్రకాష్ సూచించారు. ఆదివారం కాట్రపల్లి, కొలన్ పల్లి, కొత్తూరు గ్రామాల్లో పర్యటించి పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. తడి చెత్తను ఆకుపచ్చ బుట్టలో, పొడి చెత్తను నీలం బుట్టలో వేయాలని గ్రామస్తులకు వివరించారు. పారిశుధ్య నిబంధనలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.