KNR: బెజ్జంకి లక్ష్మి నర్సింహా స్వామిని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బండి సంజయ్ ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.