మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని పవనపుత్ర కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. శనివారం రాత్రి కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు వారు కాలనీలో పర్యటించిన సందర్భంగా వారిని అభయాంజనేయ స్వామి దేవాలయంలో కాలనీవాసులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐదవ డివిజన్ కార్పొరేటర్ లలితా భానుచందర్ తదితరులు పాల్గొన్నారు