WGL: నల్లబెల్లి మండలం కొండలైయిపల్లె గ్రామంలో మిరప కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. మిరప పంట కోత తర్వాత సరైన విధానంలో ఎండబెట్టడం, తేమ లేకుండా నిల్వ చేయడం ఎంతో ముఖ్యమని రైతులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.