VKB: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిట్స్ ఉపయోగ పడతాయని సర్పంచ్ డీవై నర్సింహులు, ఉప సర్పంచ్ ప్రసాద్ అన్నారు. శనివారం పెద్దేముల్ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ డేను నిర్వహించారు. విభిన్న అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎం సునీత, ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, శంకర్, తదితరులు ఉన్నారు.