NRPT: మరికల్ మండలం చిత్తనూరులోని ఇథనాల్ కంపెనీలో ఏర్పాటు చేస్తున్న సింథటిక్ కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే నిలిపివేయాలని ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం ప్రొఫెసర్ హరగోపాల్ చేతుల మీదుగా కరపత్రాలను విడుదల చేశారు. సింథటిక్, ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల 23 గ్రామాలకు నష్టం కలిగించే అవకాశం ఉందని అన్నారు.