MHBD: మరిపెడ(M) కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో DSFI జాతీయ అధ్యక్షుడు డా. వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం లంబాడీ సమాజానికి మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా మోసం చేసిందని విమర్శించారు. CM స్పందించి చేవెళ్ల లో ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.