కృష్ణా: వేసవిలో నర్సరీలో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డి.ఆర్.డి.ఓ ఉమాదేవి సూచించారు. గురువారం ఆమె పానగల్ మండలంలోని వివిధ నర్సరీలను పరిశీలించారు. వన సేవకులు గ్రామపంచాయతీ కార్యదర్శులు, అధికారుల సమన్వయంతో మొక్కలు పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. నీరందక మొక్కలు ఎండి పోతే చర్యలు తప్పవు అన్నారు.