BHPL: TGలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో 22 లక్షల మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని TRP మొగుళ్లపల్లి (M) అధ్యక్షులు రాజేష్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని, ఫీజు ఒత్తిడితో ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వెంటనే బకాయిలను విడుదల చేయాలన్నారు.