MBNR: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు వెంటనే గ్రౌండ్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి పాల్గొన్నారు.