PDPL: ధర్మారం మండలం నంది మేడారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) సర్వసభ్య సమావేశం ఈనెల 23న (సోమవారం) ఏర్పాటు చేసినట్లు CEO మల్లేశం తెలిపారు. ఉదయం 9 గంటలకు స్థానిక రైతు వేదికలో సంఘం పర్సన్ ఇంఛార్జ్ శివకుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంఘంలోని సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని సూచించారు.