GDWL: గద్వాల్ మండలం రేకులపల్లికి చెందిన ఇద్దరు యువకులు గ్రామ సమీపంలోని కృష్ణా నదిలోకి ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లారు. నదిలో వరద పెరగడంతో పడవ బోల్తా పడింది. అందులో ఉన్న చందు అనే యువకుడికి ఈత రాకపోవడంతో నదిలో గల్లంతయ్యాడు. మరో యువకుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.