JGL: జిల్లా కేంద్రంలోని స్థానిక చారిత్రాత్మక గుడికోట శివాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కట్కం రవీందర్, కౌన్సిలర్లు, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. ఆలయ సిద్ధాంతి ఈ సంవత్సర ఫలితాలను భక్తులకు తెలిపారు.